ఢిల్లీలో పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్

by Ajay Maddhiboyina |

ఢిల్లీ పేలుడు ఘ‌ట‌నతో దేశంలో మ‌రోసారి ఉగ్ర‌క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఎర్రకోట దగ్గర కారులో బ్లాస్ట్ జరగ్గా ఇప్పటి వరకు 9 మంది మరణించారు. మరో 20మంది గాయపడ్డారు. పేలుడుకు కారణమైన కారు దృష్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనుమానితుడి ఫోటో గ్రాఫ్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఢిల్లీలో పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీ పేలుడు ఘ‌ట‌నతో దేశంలో మ‌రోసారి ఉగ్ర‌క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఎర్రకోట దగ్గర కారులో బ్లాస్ట్ జరగ్గా ఇప్పటి వరకు 9 మంది మరణించారు. మరో 20మంది గాయపడ్డారు. పేలుడుకు కారణమైన కారు దృష్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనుమానితుడి ఫోటో గ్రాఫ్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. పుల్వామా ఎటాక్‌‌తో ఈ ఉగ్రదాడికి లింక్ ఉందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇక దేశ‌రాజ‌ధానిలో పేలుడుతో దేశవ్యాప్తంగా హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మూడు రోజుల పాటు ఎయిర్‌పోర్టుల్లో హై సెక్యురిటీ ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ పార్కింగ్ పైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు.

Next Story